కేసీఆర్ లాగా అందరూ టోపీ పెట్టుకోవాలన్న ఓవైసీ

రైతు ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ లో ఎప్పుడూ టోపీ పెట్టుకుని అందంగా కనిపిస్తారని, అలాగే తెలంగాణలోని ప్రతి రైతు.. కేసీఆర్ మాదిరిగా టోపీ పెట్టుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫాంహౌస్ పచ్చగా ఉన్నట్లే ప్రతి రైతు పొలం పచ్చగా ఉండాలని ఓవైసీ ఆకాంక్షించారు. రైతుల ఆత్మహత్యలకు అందరూ బాధ్యత వహించాలన్న అక్బరుద్దీన్...మంత్రుల నియోజకవర్గాల్లోనే సూసైడ్స్ ఎక్కువగా ఉన్నాయంటూ రికార్డులతో సహా వివరించారు. అన్నదాతల ఆత్మహత్యలకు వరుణదేవుడే కారణమని వ్యవసాయ మంత్రి పోచారం తప్పించుకోవాలని చూస్తున్నారని, కనీసం ఇప్పటికైనా సూసైడ్స్ కు మూలకారణాలేంటో విశ్లేషించి... నివారణా చర్యలు చేపట్టాలని కోరారు,

Online Jyotish
Tone Academy
KidsOne Telugu