Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోడ్లు ఊడుస్తూ బీజేపీ నేతల నిరసన
posted on: Oct 1, 2015 12:37PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ రోజు సభ ప్రారంభంకాగానే అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు తమ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. కానీ స్పీకర్ మాత్రం వాటిని తిరస్కరించి ప్రశ్నోత్తరాలకు సమయాన్ని కేటాయించారు. దీంతో ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఒకపక్క ఆందోళన జరుగుతున్నా టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అంగన్ వాడీ సమస్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావును ప్రశ్నలు వేయగా ఆయన సమాధానమిచ్చారు. అయినా కానీ ప్రతిపక్షాలు ఆందోళన విరమింపకపోవడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా మరోవైపు బీజేపీ నేతలు అసెంబ్లీ ముందు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీలో తొలగించిన పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. జీతాలు పెంచాలని జీహెచ్ఎంసీ కార్మికుల బట్టలు ధరించి చీపుర్లతో రోడ్లు ఊడ్చారు.



.jpg)


