కేసీఆర్ కు చిరాకు తెప్పించిన మంత్రి..నీ పని నువ్వు చూసుకో

posted on: Oct 1, 2015 10:48AM


 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రైతు ఆత్మహత్యలపై.. వరంగల్ ఎన్ కౌంటర్ పై..ఇంకా పలు అంశాలపై చర్చ జరుగుతూ ప్రతిపక్షాల వాదనలు.. అధికార పక్షాల వాదనలతో అట్టడుకుతోంది. అయితే సాధారణంగా నేతలు ప్రత్యర్ధులపై కామెంట్లు..కౌంటర్లు ఇస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ మంత్రిగారు అత్యుత్సాహం చూపి తన రాజకీయ అభ్యర్ధిపైనే కామెడీగా మాట్లాడేసరికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో చెప్పించుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ మధుసూధనాచారి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చదవటం మొదలు పెట్టారు. స్పీకర్ మధుసూదనాచారి ఆయన్ను కూర్చోమని చెప్పినా వ్యవసాయ మంత్రి మాత్రం తన ప్రకటన చదువుకుంటూ వెళుతున్నారు. అయితే ఆ సమయంలో మంత్రి జగదీశ్ కల్పించుకొని కాస్త గట్టిగా ఓ అన్నా కూకో అన్నా అంటూ గట్టిగా వ్యాఖ్యనించారు. అయితే జగదీశ్ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తూ నీకేం పని.. నీ పని నువ్వు చూసుకో అంటూ హెచ్చరించారు. మొత్తానికి ప్రత్యర్ధుల మీద దూకుడు చూపించే జగదీశ్ రెడ్డి పార్టీ అభ్యర్దులపై కూడా చూపిస్తే ఎలా ఉంటుందో మంత్రిగారికి తెలిసొచ్చుంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...