కేసీఆర్ ఫెయిల్ అయ్యారంటున్న తమ్మినేని

posted on: Oct 15, 2015 1:38PM

 

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిప్పులు చెరిగారు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో సక్సెస్ అయ్యారేమో కానీ, ముఖ్యమంత్రిగా పరిపాలనలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారంటూ తమ్మినేని ఆరోపించారు. రైతులు, కార్మికులు, గిరిజనులు, దళితులు ఇలా అన్ని వర్గాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని తమ్మినేని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న తమ్మినేని... రైతుల బ్యాంకు రుణాలపై మంత్రి పోచారం పచ్చి అబద్దాలు చెబుతున్నారంటూ విమర్శించారు

google-ad-img
    Related Sigment News
    • Loading...