TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ పై టీకాంగ్రెస్ శ్రవణ్ తీవ్ర వ్యాఖ్యలు

Published on: Tue Oct 6, 2015 3:35PM

మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దందాలు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని టీకాంగ్రెస్ చీఫ్ స్పోక్స్ పర్సన్ శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు, ఇసుక మాఫియా, గ్రానైట్ దందా, దొంగనోట్ల వ్యాపారంలో ఉన్న మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు  సంబంధాలున్నాయని ఆరోపించిన శ్రవణ్...దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు, ఇవన్నీ తెలిసినా ముఖ్యమంత్రి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ నిజంగానే నిజాయితీపరుడైతే... మంత్రులు, ఎమ్మెల్యేల దందాలపై ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు, టీఆర్ఎస్ నేతలు ఒకపక్క దందాలు చేస్తూ మరోవైపు సత్యహరిశ్చంద్రుడి వారసుల్లాగా మాట్లాడుతున్నారని, కేసీఆర్ ధృత‌రాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు