దిగ్విజ‌య్‌తో తెలంగాణ‌ ఎంపిల భేటి

 

సీమాంద్రలో జ‌రుగుతున్న స‌మైక్య సెగ‌ల నేప‌ధ్యంలో తెలంగాణ ప్రాంత ఎంపిలు ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్ దిగ్విజ‌య్ సింగ్‌తో భేటి అయ్యారు. సీమాంద్రల్లో వ‌స్తున్న నిర‌స‌న‌ల‌తో నిర్ణయంలో మార్పు చేయ‌కూడ‌దని కొర‌డంతో పాటు, వీలైనంత త్వర‌గా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాల‌ని కోరారు.

రాష్ట్ర విభ‌జ‌న ఆల‌స్యమ‌వుతున్న కొద్ది స‌మ‌స్యలు జ‌ఠిల‌మ‌వుతున్నాయ‌ని కాబ‌ట్టి వీలైనంత త్వర‌గా విభ‌జ‌న ప్రక్రియ పూర్తిచేయాల‌ని కోరిన‌ట్టుగా ఎంపి రాజ‌గోపాల్ రెడ్డి చెప్పారు. సీమాంద్ర ప్రజ‌ల‌కు తాము ర‌క్షణ క‌ల్పిస్తామ‌ని ఎంపి బ‌ల‌రాం నాయ‌క్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ త‌రువాత కూడా వారిని సోదురులుగానే చూస్తాం అని ఎంపిలు  చెప్పారు.