Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తీన్మార్ మల్లన్న వెరైటీ నిర్ణయం!
posted on: May 3, 2024 5:21PM
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఒక వెరైటీ నిర్ణయం తీసుకున్నారు. కోటిన్నర విలువ చేసే తన వ్యక్తిగత ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్ మల్లన్న శుక్రవారం నాడు నల్గొండలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నల్గొండలో తీన్మార్ మల్లన్న భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ అనంతరం తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించనున్నట్టు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. చీఫ్ సెక్రటరీ ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలసి వెళ్ళి ఆస్తుల పేపర్లను అప్పగిస్తానని తీన్మార్ మల్లన్న చెప్పారు. క్లీన్ రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. తీన్మార్ మల్లన్న చేసినట్టుగా ఎలక్షన్లలో పోటీ చేసేవాళ్ళందరూ వాళ్ళ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తే భలే వుంటుంది కదూ!


.webp)
.webp)


