Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్థానిక పోరులో టీడీపీ హవా.. వైసీపీ ముఖ్య నేతలకు షాక్
posted on: Nov 18, 2021 5:28PM
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఇప్పటి వరకూ వెలువడిన మంచి ఫలితాలు సాధించింది. ఫలితాల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ జెండా ఎగిరింది. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సొంత మండలం శ్యావాలపురం జడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక ఎమ్మెల్యే జోగి రమేష్ కు షాకిస్తూ పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.
జిల్లాల వారిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు..
విశాఖ జిల్లా ఆనందపురం జెడ్పీటీసీ వైసీపీ కైవసం
వైసీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు 3,755 ఓట్ల మెజార్టీతో గెలుపు
తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం
6 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ, ఒక్కోచోట గెలిచిన సీపీఎం, సీపీఐ
విజయనగరం జిల్లాలో మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 6, టీడీపీ: 2, బీజేపీ: 1 స్థానంలో గెలుపు
శ్రీకాకుళం జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ 10, టీడీపీ 5 స్థానాల్లో గెలుపు
చిత్తూరు జిల్లాలో 8 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ 5, టీడీపీ 3 స్థానాల్లో విజయం
నెల్లూరు జిల్లాలో 4 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ 3, టీడీపీ 1 స్థానంలో గెలుపు
కడప జిల్లాలో 3 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది.
గుంటూరు జిల్లాలో 11 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 9, టీడీపీ: 2 స్థానాల్లో గెలుపు
గుంటూరు జిల్లాలో ఒక జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం
పశ్చిమగోదావరి జిల్లాలో 14 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 10, టీడీపీ: 3, జనసేన: 1
ప.గో జిల్లాలో ఒక జెడ్పీటీసీ స్థానం వైసీపీ కైవసం
తూర్పుగోదావరి జిల్లాలో 20 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 8 టీడీపీ: 6 జనసేన: 3 సీపీఐ(ఎం): 2 స్వతంత్రులు: 1
కృష్ణా జిల్లాలో 8 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 6 టీడీపీ: 2 స్థానాల్లో విజయం సాధించారు.
కృష్ణా జిల్లాలో 3 జెడ్పీటీసీ స్థానాలు
రెండు వైసీపీ, ఒకటి టీడీపీ గెలిచింది.
కర్నూలు జిల్లాలో 7 ఎంపీటీసీ స్థానాలు
7 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు.
కర్నూలు జిల్లాలో ఒక జెడ్పీటీసీ వైసీపీ కైవసం
అనంతపురం జిల్లాలో 16 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీ: 10, టీడీపీ: 6 చోట్ల గెలిచారు



.webp)


