సీఎం కిరణ్ కు టిడిపి మద్దతు

 

 

 

సమైక్యాంధ్రకు మద్దతుగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ కు బద్ద శత్రువైన తెలుగుదేశం సైతం ఈ విషయంలో ఆయనకు మద్దతు ప్రకటించింది. సమైక్య రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ వాస్తవాలే అని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరారు. సీఎం చెప్పిన వివరాలు, కష్టానష్టాలన్నింటినీ తెలుగుదేశం 2009 నుంచి చెబుతూనే ఉందని సోమిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి మరీ కిరణ్ సమైక్య వాదాన్ని వినిపించడం, చివరికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ మీద కూడా విమర్శలకు వెనుకాడకపోవడంపై సీమాంధ్ర ప్రాంతంలో ప్రశంసల జల్లు కురుస్తోంది.