తెదేపా యం.పిపై ముఖ్యమంత్రి ఆగ్రహం

 

భారత సైనికులపై అమలాపురం తెదేపా యం.పి. రవీంద్ర బాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మాజీ సైనికోద్యోగులు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఆందోళన చేప్పట్టారు. వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పిర్యాదు చేయడంతో ఆయన కూడా యం.పి.పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సంజాయిషీ నోటీసు కూడా జారీ చేయించినట్లు సమాచారం. భారత ఆర్మీలో చేరితే మద్యం, మాంసం, ఉచిత ప్రయాణాలు వంటి సౌకర్యాలు లభిస్తాయనే ఉద్దేశ్యంతోనే యువకులు ఆర్మీలో చేరుతున్నారని రవీంద్ర బాబు వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడు మాజీ సైనికులతో మాట్లాడుతూ భారతదేశాన్ని కాపాడేందుకు ప్రాణాలొడ్డి కాపలా కాస్తున్న సైనికులంటే తమ పార్టీకి చాలా గౌరవమని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu