Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నలుగురు ఎమ్మెల్సీల పేర్లు ఖరారు
posted on: May 23, 2015 11:05AM

ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. ఆ నలుగురు కృష్ణాజిల్లాకు చెందిన టీడీ జనార్ధన్, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్. అయితే మొదట విజయవాడ మాజీ మేయర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధకు స్థానం ఇవ్వాలనుకున్న అధిష్ఠానం చివరి నిమిషంలో అభిప్రాయం మార్చుకొని ఆ స్థానాన్ని బీద రవిచంద్రయాదవ్ కు ఇచ్చారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఈ నలుగురు ఎమ్మెల్సీలు ఆరెళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.


.jpg)



