విద్యార్ధుల జోలికి వస్తే సమాధి కడతాం

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధుల జోలికి వస్తే కేసీఆర్ కు సమాధి కడతామని హెచ్చరించారు. ఓయూ విద్యార్ధులపై పోలీసులు లాఠీచార్జి చేసినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.