జడ్చర్ల టిడిపి ఎమ్మెల్యే సోదరుడు హత్య
posted on Jul 18, 2013 10:05AM
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల టిడిపి ఎమ్మెల్యే చంద్రశేఖర్ సోదరుడు పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో క్కడికక్కడే మృతి చెందారు. బుధవారం దేవరకద్ర పాత బస్టాండు వద్ద ఓ కారులో జగన్మోహన్ ఉన్న సమయంలో కొందరు హఠాత్తుగా వచ్చి కాల్పులు జరిపారు. దీంతో అతను కారులోనే మృతి చెందాడు.దుండగులు ద్విచక్ర వాహనం పైన వచ్చి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు దుండగులు స్కార్పియోలో వచ్చి కాల్పులు జరిపి పరారయ్యారనే వాదన కూడా వినిపిస్తుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. హత్య జరిగిన స్థలంలో పడిన రెండు బుల్లెట్లను, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.