టీడీపీ నేతల అనుమానాస్పద మృతి

తెలుగుదేశం పార్టీ కార్యకర్త నారాయణస్వామి అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్‌సాన్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. ఉదయం వాకింగ్ కు వెళ్లిన నారాయణస్వామిని గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో టీడీపీ నాయకుడు కూడా మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. మారుతీనగర్‌కు ఆనుకుని ఉన్న కాల్వకట్ట వద్ద పురుషుడి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందిచడంతో అక్కడికి చేరుకున్న సీఐ ఉమామహేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలను బట్టి మృతిచెందింది మొగల్రాజపురం 6వ డివిజన్‌ కు చెందిన పడాల కన్నారావుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.