ఏపీని నెంబర్ వన్ గా చేయాలి..

 

ఎన్నో పార్టీలు, జెండాలు వచ్చినా అన్నీ కనుమరుగైపోయాయి.. అనేక ఇబ్బందులకు, ఒడిదుడుకులకు ధీటుగా నిలిచిన ఏకైక పార్టీ టీడీపీనే.. ఎన్నో సంక్షోభాలు చూశాం.. గౌరవం కూడా పొందాం అని చంద్రబాబు మహానాడు సభలో వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడానికి హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది టీడీపీనే.. తెలుగు వారికి ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని హైదరాబాద్ ను అభివృద్ధిచేశాం.. కానీ రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్ట్రపోయింది.. ఇప్పుడు అభివృద్ధిలో ఏపీని నెంబర్ వన్ గా చేయాలి.. కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకోవాల్సిన భాధ్యత మనపై ఉంది అని అన్నారు. అంతేకాదు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. విభజన ఇబ్బందులు అధిగమించేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అని అన్నారు.