అభ్యర్థులను ఖరారు చేసిన టిడిపి
posted on Mar 26, 2013 8:33AM
చంద్రబాబు నాయుడు పాదయాత్రలలోనే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అన్ని పార్టీలకంటే ముందుగా తమ అభ్యర్థులను టిడిపి ఖరారు చేస్తోంది. రాజమండ్రి నుండి మురళీమోహన్ ను, అమలాపురం ఎస్సీ రిజర్వ్ సీటును గొల్లపల్లి సూర్యారావుకు, కాకినాడ సీటును పోతుల విశ్వంకు, ఏలారు సీటును మాగంటి బాబుకు, మచిలీపట్నం సీటును సిట్టింగ్ ఎంపి కొనకళ్ల నారాయణరావుకు, విజయవాడ సీటును కేశినేని నానికి, వల్లభనేని వంశీకి ముందుగా అనుకున్నట్టు గన్నవరం నుండి కాకుండా నూజివీడు అసెంబ్లీ సీటును ఖరారు చేసినట్లు తెలిసింది. అభ్యర్థులను ఖరారు చేయడమే కాకుండా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిపై ఉద్యమించాలని చంద్రబాబు పిలుపునిచ్చినట్లు తెలిసింది.