టీడీపీలో చేరికలపై పల్లా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు

 

తెలుగుదేశం పార్టీలో చేరికలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు.  టీడీపీలోకి ఇతర పార్టీలోకి వస్తామనే వారిపై పార్టీ హైకమాండ్ విచారణ చేస్తుందని తెలిపారు. ఆ తర్వాత పార్టీ అనుమతితోనే వారిని తీసుకోవాలని సూచించారు. టీడీపీలో వివిధ హొదాల్లో ఉన్న నాయకులంతా ఈ సూచన పాటించాలని పల్లా తెలిపారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం ఇతరులను చేర్చుకునే ముందు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలపాలన్నారు. పార్టీలోకి వస్తామనే వారిపై పూర్తిగా విచారణ చేశాకే ఆహ్వానించాలని చెప్పారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu