TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆంధ్రాబ్యాంకు మీద బాంబు

Published on: Thu Apr 9, 2015 10:39AM

 

తమిళనాడుకు చెందిన కూలీలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్ కావడం మీద అక్కడి రాజకీయ పార్టీలు నానా హడావిడి చేస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అనేక బస్సులను ధ్వంసం చేశారు. ఇప్పుడు మరింత ముందడుగు వేసి బాంబుల వరకూ వెళ్ళారు. తూత్తుకుడిలో వున్న ఆంధ్రాబ్యాంకు మీద ఆందోళనకారులు బాంబు విసిరారు. ఆ సమయంలో బ్యాంకు మూసి వుండటంతో ప్రమాదం తప్పింది. అలాగే వేలూరు, తిరువణ్ణామలైలలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సంస్థలు, బ్యాంకుల వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళ్ళే 200 బస్సులను మూడోరోజు కూడా ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు.