Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీవీ ఛానల్ ఆఫీసు మీద నాటు బాంబులు
posted on: Mar 12, 2015 12:22PM

చెన్నైలోని పుతియా తలైమురై అనే తమిళ టీవీ ఛానల్ కార్యాలయం మీద గుర్తు తెలియని వ్యక్తులు నాటుబాంబులను విసిరారు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. గురువారం తెల్లవారు ఝామున ఈ ఘటన జరిగింది. టిఫిన్ బాక్సుల్లో వుంచిన నాటు బాంబులను సదరు వ్యక్తులు టీవీ ఛానల్ కార్యాలయ ఆవరణలోకి విసిరారు. వాటిలో ఒక బాంబు పేలినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసురుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో ఇంతవరకు ఎవరినీ పోలీసులు అరెస్టు చేయలేదు. పుతియా తలైమురై టీవీ ఛానల్లో తాళి అనే వివాదాస్పద కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఈ ప్రోగ్రాంని వ్యతిరేకిస్తూ హిందూ మున్నై అనే అతివాద సంస్థ ప్రదర్శనలు కూడా నిర్వహించింది. ఆదివారం నాడు ఈ సంస్థ సభ్యులు ఛానల్ కార్యాలయం మీద దాడిచేసి ఫర్నిచర్ని ధ్వంసం చేయడంతోపాటు కొంతమంది సిబ్బందిని కూడా గాయపరిచారు. ఇప్పుడు ఈ సంస్థ సభ్యులే బాంబు దాడి చేసి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


.jpg)



