Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాడు మళ్లీ అమ్మదేనా..?
posted on: May 19, 2016 9:50AM
.jpg)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ సమయానికి డీఎంకే కూటమి ముందంజలో ఉండి ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా అనిపించేంతగా దూసుకెళ్లింది. అయితే తర్వాత విజయలక్ష్మీ అమ్మ వైపు మొగ్గు చూపుతున్న్టట్లు తెలుస్తోంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ఇప్పటి వరకు 177 స్థానాల ఫలితాలు తెలుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అన్నాడీఎంకే 102 స్థానాల్లోనూ, డీఎంకే 80 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. అయితే కౌంటింగ్ ఇంకా పూర్తిస్ధాయిలో జరగాల్సి ఉంది. దాంతో ఏ క్షణంలో ఎటు మలుపు తిరుగుతోందనన్న ఉత్కంఠ తమిళనాడులో నెలకొంది. కరుణ, జయ నివాసాల వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది.






