గోపీచంద్ తో మిల్క్ బ్యూటీ రొమాన్స్
posted on: Nov 11, 2013 11:31AM

గతకొద్దిరోజులుగా టాలీవుడ్ కి దూరమైన మిల్క్ బ్యూటీ మళ్ళీ తెలుగులో తన హవా కొనసాగించడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం మహేష్ హీరోగా నటిస్తున్న "ఆగడు" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా, మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గోపీచంద్ హీరోగా వీరభద్రం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటించనున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Latest YouTube Trending Video NEWS






