నన్ను పిలవలేదు.. దానం నాగేందర్..
posted on: Dec 3, 2015 10:30AM

టీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి కాంగ్రెస్ నేతలందరూ హాజరవ్వగా దానం నాగేందర్ మాత్రం డుమ్మా కొట్టారు. అయితే సమన్వయ కమిటీ సమావేశానికి రానని నిన్ననే ఉత్తమ్ తెలిపారని నేతలు అంటున్నారు. కానీ దానం నాగేందర్ మాత్రం సమన్వయ కమిటీ సమావేశానికి ఉత్తమ్ నన్ను పిలవలేదు..కావాలనే నాపై దుష్ర్పచారం చేస్తున్నారు అని అంటున్నారు. కాగా కాసేపట్లో పార్టీ అనుచరులతో తన నివాసం వద్ద దానం భేటీ కానున్నారు.



.jpg)



