విరాట్ చెంతకు అనుష్క
Published on: Wed Mar 25, 2015 2:21PM

బీసీసీఐ క్రికెటర్లకు వారి భార్యలను, ప్రియురాళ్లను కలిసే విషయంపై నిషేదం ఎత్తివేసిందని మనకు తెలిసిందే. అయితే అలా ఛాన్స్ ఇచ్చిందో లేదో ఇలా అనుష్కశర్మ సిడ్ని చేరుకుందట. 26న జరిగే సెమీ ఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. తన లవర్ ఆడబోయే ఆటను దగ్గరుండి మరీ చూసేందుకే అక్కడికి వెళ్లిందట ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే కొంత మంది భార్యలు సిడ్నీ చేరుకున్నారు. అనుష్కను తను ప్రేమిస్తున్నట్టుగా కొద్ది రోజుల క్రితమే కోహ్లి చెప్పిన విషయం తెలిసిందే. ముందు జరిగిన రెండు, మూడు మ్యాచుల్లో సెంచరీ కొట్టని విరాట్ కోహ్లీ అనుష్కశర్మ రాకతో ఈ మ్యాచ్లో అయినా సెంచరీ కొడతాడేమో చూద్దాం.


