TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సస్పెన్షన్ కుగురైన ఎస్సై సూసైడ్‌!

Published on: Fri Jan 31, 2025 9:55AM

ఆంధ్రప్రదేశ్ లో ఒక సబ్ ఇన్ స్పెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీసు స్టేషన్ లో ఇటీవలి కాలం వరకూ  ఎస్ఐగా విధులు నిర్వహించిన  ఏజీఎస్ మూర్తి   ఇటీవల సస్పెండ్ అయ్యారు. దీంతో గత కొద్ది రోజులుగా డిప్రషన్ కు గురైన ఆయన శుక్రవారం (జనవరి 31) ఉదయం తన  రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలేమిటన్నదానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.