క్రాసింగ్‌ రైల్వేస్టేషన్‌ కి సురేష్ ప్రభు శంకుస్థాపన...


కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ. 10 కోట్లతో నిర్మించనున్న తిరుచానూరు క్రాసింగ్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి ఆన్‌లైన్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి కీలకమైన మౌలిక వసతులు కల్పించడంలో రైల్వే వ్యవస్ధ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. రైల్వే బడ్జెట్‌ రూ.40 వేల కోట్ల నుంచి లక్షా 20 వేల కోట్లకు చేరిందని చెప్పారు. బడ్జెట్‌ పెరగడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపడతామని మంత్రి తెలిపారు.