ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై స్టే నిరాకరణ

posted on: Jan 25, 2019 10:52AM

 

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లోక్ సభ,రాజ్య సభలో సైతం ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ అనే సంస్థతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు సుప్రీంను ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ  పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై స్టే విధించడానికి నిరాకరించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...