Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రధాని వార్నింగ్... 75 గంటల్లో 303 నక్సలైట్లు సరెండర్
posted on: Oct 19, 2025 12:58PM

ప్రధాని నరేంద్ర మోదీ నక్సలిజం, జాతీయ భద్రత, యువత భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం అనేది కేవలం పదం మాత్రమేనని.. వాస్తవానికి అది మావోయిస్టు ఉగ్రవాదం అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ ఉగ్రవాదాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని ఆరోపించారు. యూపీఏ హయాంలో అభివృద్ధి చెందిన అర్బన్ నక్సల్స్ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉందని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఈ ఉగ్రవాదం గురించి దేశ ప్రజలకు తెలియకుండా అర్బన్ నక్సల్స్ అనే వ్యవస్థ పెద్ద ఎత్తున దాచిపెట్టే పని చేసిందన్నారు.
చాలా మంది మావోయిస్టు ఉగ్రవాద బాధితులు తమ కాళ్లు, చేతులు పోగొట్టుకుని ఢిల్లీకి వచ్చినా.. వారి బాధను బయటి ప్రపంచానికి తెలియకుండా ఈ కాంగ్రెస్ వ్యవస్థ అడ్డుకుందని మోదీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని తిరిగేవాళ్లు.. ఇప్పటికీ మావోయిస్టులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని విమర్శలు గుప్పించారు. మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకున్నారని ప్రధాని తెలిపారు.



.webp)


