సునందా పుష్కర్ మృతి కేసు.. కొత్త డాక్టర్ల బృందం

 

మాజీ కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంధ పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మృతిపై శశిథరూర్ మీద కూడ ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే ఈమె విషంతో చనిపోయింది అని ఎయిమ్స్  వైద్యులు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఫొరెన్సిక్ సాక్ష్యాన్ని విశ్లేషించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది. నలుగురు డాక్టర్లు ఉన్న ఈ బృందంలో ఇద్దరు ఛండీగఢ్, పుదుచ్చేరి, ఢిల్లీల నుంచి ఒక్కో డాక్టర్ ఉన్నారు. సునందా పుష్కరం మరణం వెనుక మిస్టరీని ఛేదించడంలో దర్యాప్తు అధికారులు విఫలమవ్వడంతో కేంద్రం ఈ డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది.