TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌‌పై దయ చూపిన భానుడు..

Published on: Tue Apr 26, 2016 2:04PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 36 డిగ్రీ‌లను దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. అలాంటి వాతారణంలో ప్రజలు అడుగు బయటపెట్టాలంటేనే వణికిపోతున్నారు. అయితే మొన్న కురిసిన వర్షంతో వాతావరణం కాస్తంత చల్లబడినట్లే చల్లబడి..మళ్లీ వేడెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మార్పు వచ్చింది. కొద్దిసేపటి క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. దిల్‌‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, చార్మినార్, నాంపల్లి, మైలార్‌దేవ్‌పల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. దీంతో జనానికి ఎండవేడిమి నుంచి కాస్తంత ఉపశమనం లభించింది.