ఈటీవి సుమన్ కు ప్రముఖుల నివాళి ఫోటోలు
Published on: Fri Sep 7, 2012 6:13PM
రామోజీరావు కుమారుడు సుమన్ మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సంతాపం తెలిపింది. రచయితగా, చిత్రకారుడిగా, నటుడిగా, ఈటీవీ డైరెక్టర్గా తెలుగు టీవీ ప్రేక్షకులకు సుమన్ సుపరిచితులని పార్టీ పేర్కొంది. చిన్నవయసులోనే సుమన్ కన్నుమూయటం బాధాకరమని తెలిపింది. సుమన్ సతీమణి విజయేశ్వరి, పిల్లలు, రామోజీరావు, కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానూభూతి వెల్లడించింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న సుమన్ భౌతికాయానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎంపీ సుజనా చౌదరి, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, మంత్రులు డికె అరుణ, సబితా ఇంద్రా రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. వారందరూ సుమన్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయామని చంద్రబాబు, కిరణ్ అన్నారు. మంచి నటుడిని కోల్పోయామని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు ముఖ్యనేత చిరంజీవి అన్నారు.






.jpg)


