Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పార్టీ మారేది లేదు.. సుజయ్ కృష్ణ
posted on: Jun 30, 2015 6:41PM

వైఎస్ఆర్ సీపీ పార్టీలోకి బొత్సా సత్యనారాయణ చేరిన తరువాత ఆ పార్టీలో ఉన్న నేతలు కొందరు అసంతృప్తిగా ఉన్నారన్నది మాత్రం వాస్తవం. ముందుగా బొత్సచేరికతో ఆపార్టీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు వైసీపీని వీడి బయటకు వస్తారనే వార్తలు బాగానే వచ్చాయి. అయితే ఇప్పుడు సుజయ్ కృష్ణ మాత్రం తాను పార్టీని మారేదిలేదని.. పార్టీకి నష్టం కలిగించే పనులు చేయనని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. టీడీపీ తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. వైకాపాలోకి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చేరే సమయంలో తాను లేనని అందుకే ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని అన్నారు. అంతేకాని వ్యక్తిగత కారణాలు ఏం లేవని స్పష్టం చేశారు.



.jpg)


