ఏపీకి కేంద్రసాయం.. సాయంతంలోగా ప్రకటన.. సుజనా

posted on: Sep 24, 2015 3:52PM

 

ఏపీకి కేంద్రం అందించే సాయంపై సాయంత్రంలోగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని కేంద్రమంతి సుజనా చౌదరి తెలిపారు. రాజధాని గురించి.. వెనుకబడ్డ ప్రాంతాల గురించి కేంద్రంతో చర్చించామని..దీనిపై వివిధ శాఖల మంత్రులతో చర్చిస్తున్నామని.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో మరోసారి కలిసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంతేకాదు ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రాభివృద్ధికి సాయం పై నీతి అయోగ్ లో రెండు సార్లు చర్చించామని.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ కోసం తాము కేంద్రంతో చర్చిస్తున్నామని.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ వర్కవుట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. కాగా కేంద్రం జిల్లాకో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...