ఆఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి.. 52 మంది మృతి

 

ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్టికా ప్రావిన్స్‌లోని ఓ వాలీబాల్ మైదానంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 52 మంది మరణించగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మైదానంలో వాలీబాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరగడంతో మృతుల సంఖ్య అధికంగా వుంది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదని ఆఫ్ఘన్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటన మీద ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు మహ్మద్ అష్రాఫ్ ఘని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి.