TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో తనిఖీలు కారణమదేనా?

Published on: Sat Jul 16, 2022 12:37PM

రెడ్డొచ్చె మొదలాడు అన్న సామెతలాగే ఉంది జగన్ సర్కార్ తీరు. మూడేళ్లుగా ఆ పార్టీ ఘనంగా చెప్పుకుంటున్న సంక్షేమ ఫథకాలపై ఆ పార్టీ అధినేతకే అంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ కే అనుమానం కలిగిందా అన్న అనుమానాలు ఆ పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి. గత మూడేళ్లుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా.. సర్కార్ పై ఇంతటి వ్యతిరేకత ఏమిటన్నది జగన్ కు అంతుబట్టడం లేదంటున్నారు.

తాజాగా విడుదలైన ఒక జాతీయ స్థాయి సర్వేలోనే ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని వెల్లడి కావడంతో జగన్ లో  అంతర్మథనం మొదలైందని అంటున్నారు. ఇటీవల వాహన మిత్ర లబ్ధిదారులకు సొమ్ము పందేరం చేసిన కార్యక్రమంలో ఆయన తన భుజాలను తానే చరుచుకుంటూ.. అద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది జగనన్న ప్రభుత్వమేనని తనకు తానే కితాబిచ్చుకున్నారు. అంతలో ఏమైందో ఏమో.. సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు సైతం సంతృప్తి వ్యక్తం చేయకపోవడానికి తన మానస పుత్రికగా జగనే చెప్పుకుంటున్న సచివాలయ వ్యవస్థేకారణమన్న అనుమానం ఆయనకు కలిగిందా అని వైసీపీ శ్రేణులు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే జగన్ సచివాలయాలలో ఆకస్మిత తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారని అంటున్నాయి. సంక్షేమ పథకాల లబ్దిదారులు ఏమనుకుంటున్నారు,

సచివాలయాల్లో వారికి అందుతున్న సేవలు ఎలా ఉన్నాయి ? లోటుపాట్లు  ఏమిటి అన్న విషయాలు తెలుసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని జగన్ నిర్ణయించారు. తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంఘనంగా ప్రారంభించిన గ్రామ,వార్డు సచివాలయాలకే   ప్రతీ సంక్షేమ పథకాన్నీ లింక్ చేసిన ప్రభుత్వం. ఇప్పుడు అలా చేసి తప్పు చేశామా అని మధన పడుతున్నట్లు పార్టీ శ్రేణులు అంటున్నాయి. అందుకే సచివాలయాల పని తీరు ఎలా ఉంది? సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా జరుగుతోంది.

 వాటిపై ప్రజల గ్రామ,వార్డు సచివాలయాలల్లో తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లుకు ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఈ తనిఖీల కోసం ప్రభుత్వం ముగ్గురు అధికారులకు బాధ్యతలు అప్పగించింది. తహసీల్దార్ మునిసిపల్ కమిషనర్, మూడు జాయింట్ కలెక్టర లకు ఈ తనిఖీల బాధ్యతలు అప్పగించింది.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో చేపడుతున్న తనిఖీల్లో ఏయే అంశాల్ని పరిశీలించాలన్నది కూడా కలెక్టర్లకు నిర్దేశించినట్లు తెలుస్తోంది.  ఇందులో సచివాలయాల్లో ప్రతి రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రజలకు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు...!!