Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారత్-పాక్ లపై సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు
posted on: Jun 10, 2016 3:18PM

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడే స్వామి ఇప్పుడు తాజాగా పాకిస్థాన్-భారత్ ల మధ్య సంబంధాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా గతంలో సోవియట్ రష్యా వ్యవహరించిన తీరుగా వ్యవహరిస్తున్నదని అన్నారు. అప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థపై సోవియెట్ రష్యాకు పూర్తి పట్టు ఉండేదని, ఇప్పడు అమెరికా తీరు అప్పటి సోవియెట్ యూనియన్ ను తలపిస్తున్నదని స్వామి పేర్కొన్నారు. అప్పట్లొ తాను భారత ఆర్థిక వ్యవస్థపై రష్యా పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడానని పేర్కొన్నారు. అయితే మోడీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దీనిపై ఇంకా ఎంత దుమారం రేగుతుందో చూడాలి.


.jpg)



