ఒక వైపు ఏఐ, మరోవైపు ట్రంప్.. స్టాక్ మార్కెట్లు కుదేలు
posted on: Feb 24, 2026 2:01PM

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఫిబ్రవరి 24) తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రధానంగా ఐటీ రంగంలోని షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ మధ్యాహ్నం 12.15 గంటల సమయానికి సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు, నిఫ్టీ 25,500 కీలక స్థాయికి దిగువన కొనసాగుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వల్ల ఐటీ రంగంపై పడే ప్రభావం పట్ల ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనలు ఈ పతనానికి ప్రధాన కారణగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టెక్ మహీంద్ర, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నర్, టీసీఎస్ , ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐబీఎం సిట్టమ్స్లో ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను అంతథ్రోపిక్ క్లాడ్ ఆధునికీకరించగలదన్న ప్రచారంతో ఐబీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా 15% గ్లోబల్ టారిఫ్ విధిస్తూ జారీ చేసిన ఆదేశాలు, అమెరికా సుప్రీంకోర్టు తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే భారీగా టారిఫ్లు విధిస్తానని చేసిన హెచ్చరికలు అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితిని సృష్టించాయి. ఇది నేరుగా భారతీయ ఎగుమతి రంగాలపై, ముఖ్యంగా ఐటీపై ప్రభావం చూపింది.







