Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
posted on: Jun 29, 2025 10:40AM
పూరి జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు మృతి చెందారు. ఆదివారం (జూన్ 29) తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో మూడు రథాలు గుండిచా ఆలయం దగ్గరకు చేరుకున్నాయి. ఈ సమయంలో రథాలపై ఉన్న దేవతల దర్శనం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. అ తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. పూరి జగన్నథ రథయాత్రలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించడం పట్ల ఒడిశా మంత్రి పృధ్విరాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
పూరీలో ఏటా జరిగే జగన్నాథ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను రథాలలో ఊరేగిస్తూ గుండిచా ఆలయానికి తీసుకెళ్లే ఈ ఉత్సవం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యత గల ఉత్సవంగా భావిస్తారు. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కాగా ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


.webp)



