Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పుష్ప సినీమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట..మహిళ మృతి
posted on: Dec 5, 2024 7:27AM
.webp)
సినీమా పిచ్చి ఓ మహిళ ఉసురు తీసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా కోసం దిల్ షుక్ నగర్ నుంచి తన పిల్లలతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తున్నథియేటర్ కు వచ్చిన రేవతి అనే మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వివరాలిలా ఉన్నాయి.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలు బుధవారం రాత్రి ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప2 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ప్రేక్షకులకు అభివాదం చేయడానికీ అల్లు అర్జున్ కూడా ఆ సమయంలో ఆ థియోటర్ వద్దకు వచ్చారు. దీంతో అల్లు అర్జున్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. రేవతి మరణించగా ఆమె కుమారుడు కిమ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.






