శ్రీవారి హుండీ ఆదాయం 3.92 కోట్లు
Published on: Sat Jun 17, 2023 9:34AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (జూన్ 16) శ్రీవారిని 72,299 మంది దర్శించుకున్నారు. 36వేల378 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 3.92 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక శనివారం (జూన్ 17) శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.


