Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం
posted on: May 11, 2025 5:36PM
.webp)
శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 70 మంది బౌద్థ యాత్రికులతో వెళ్లున్న బస్సు కోట్మలే ప్రాంతంలో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు కెపాసిటీ కంటే 20 మందిని అదనంగా తీసుకెళ్లున్నట్లు పోలీసులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 25 మంది క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తొలుత 8 మంది చనిపోగా.. ఆస్పత్రిలో మరో ముగ్గురు తుదిశ్వాస విడిచారు. మృతుల్లో ఐదుగురు పురుషులు ఉండగా.. ఆరుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.






