యాదాద్రిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
posted on: Nov 8, 2024 10:45AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం యాదాద్రి లక్మి నరసింహాస్వామిని దర్శించుకున్నారు. హైద్రాబాద్ లోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి యాదాద్రి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదాద్రికి చేరుకోవడం ఇది రెండోసారి. మంత్రులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో ప్రతేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ది పనులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. యాదాద్రి నుంచి వలిగొండకు రోడ్డు మార్గంలో వలిగొండకు చేరుకున్నారు. సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్రను రేవంత్ రెడ్డి ప్రారంభించారు.


.webp)



