Latest News

మస్తుగా ఎంజాయ్ చేసిన తారలు

posted on: Jan 21, 2014 8:56AM

 

స్టార్ హీరో, స్టేటస్, పదవి, హొదా అనేవి లేకుండా 80వ దశకంలో సినీతెరకి పరిచయమై, ఆయా ప్రాంతీయ భాషల్లో సినీప్రపంచాన్ని ఏలిన కొంతమంది తారలంతా ఒక్కచోట కలిసారు. తారలు దిగివచ్చిన వేళ అంటే ఇదేనేమో మరి. ఎవరి పనుల్లో వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆనాటి తారలు ఒక్కదగ్గర చేరి సంతోషంగా గడిపారు. ఈనెల 18న చెన్నైలోని మోహన్ లాల్ ఫామ్ హౌజ్ ఈ వేడుకకి వేదికైంది. ఇందులో భాగంగా రజినీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, బాలక్రిష్ణ, రాధిక, రమ్యక్రిష్ణ, వెంకటేష్, అర్జున్, భానుచందర్, నరేష్, రాధ, సుహాసిని, సుమలత,సుమన్, మోహన్, రమేష్ అరవింద్, జయరాం, ఖుష్బూ, నదియా, మేనక, సరిత, అంబిక ఇలా 32 మంది సినీప్రముఖులు ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు. వచ్చే ఏడాది మళ్ళీ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది కమల్ హాసన్, నాగార్జున వంటి తారలు కూడా హాజరవ్వాలని వీరు అనుకున్నారట. ఇంతమంది తారలు కలిసి ఎంజాయ్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో హాల్ చల్ చేస్తుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...