తెలంగాణ పై నిర్ణయం జరిగిపోయింది: సోనియా

 

  sonia gandi telangana, telangana issue congress, sonia gandhi congress ministers

 

 

ప్రత్యేక తెలంగాణ పై నిర్ణయం జరిగిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సీమాంధ్ర నేతలకు స్పష్టం చేశారు. అయితే అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం ఉంటుందని కూడా ఆమె చెప్పారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నేతలకు సోనియా సూచించారు. కాంగ్రెస్ ఎవరికి వ్యతిరేకం కాదని ప్రజలకు చెప్పాలని ఆమె అన్నారు. ఈ రోజు సోనియా గాంధీని కలిసిన సీమాంధ్ర నేతలను ఆమె బుజ్జగించినట్లు సమాచారం. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, ఈ పరిస్థితుల్లో వెనక్కి వెళ్లలేమని ఆమె వారితో చెప్పినట్టు తెలియవచ్చింది. ఈ ఒక్కరోజుతో అంతా అయిపోందని అనుకోవద్దని ఆమె నచ్చ చెప్పినట్లు సమాచారం.