TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యాసిడ్ దాడి బాధితురాలి వివాహం

Published on: Fri Apr 17, 2015 4:38PM

 

యాసిడ్ దాడికి గురైన బాధితురాలు సోనాలీ ముఖర్జీ వివాహం జరిగింది. ఝార్ఖండ్‌కి చెందిన సోనాలీ ముఖర్జీని ఆమె ఫేస్‌బుక్ స్నేహితుడు వివాహం చేసుకున్నాడు. ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చిత్తరంజన్ దాస్ తివారీ అనే వ్యక్తితో ఝార్ఖండ్‌లోని బొకారోలో ఆమె వివాహం జరిగింది. యాసిడ్ దాడికి గురైన ఆమె గతంలో కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ఎంతో స్ఫూర్తిమంతంగా మాట్లాడి అమితాబ్ బచ్చన్ నుంచి ప్రశంసలను కూడా పొందింది. ఆమె ప్రభుత్వోద్యోగం కోసం డిమాండ్ చేశారు. ఆమె చేసిన పోరాటం ద్వారా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆమె ధైర్యాన్ని గమనించిన చిత్తరంజన్ తివారి ఆమెకు ఫేస్‌బుక్‌ లకౌంట్‌కి ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్ పంపించాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఇప్పుడు వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.