TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు

Published on: Tue May 26, 2015 10:45AM

 

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు. నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మినీ మహానాడులో ఆయన ప్రసంగిస్తూ ఈ మధ్య పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు ఆర్డీఓ ను కలవడానికి వెళితే పట్టించుకోలేదని, వెంటనే అతనికి ఫోన్ చేసి మందలించామని తెలిపారు. ఎలాంటి పరిస్థితిలోనైనా అధికారుల కారణంగా పార్టీకి, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నా, కార్యకర్తలను నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాకు వద్దంటున్నా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొంతకాలం తరువాత తెలంగాణ వారు ఆంధ్రాలో కలవాలని కోరుకునే రోజు వస్తుందని అన్నారు.