మంచుతుపాను ధాటికి గడ్డకట్టిన అమెరికా.. ఎనిమిది మంది మృత్యువాత

posted on: Jan 23, 2025 9:30AM

అమెరికాను మంచు తుపాను వణికించేస్తోంది. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో మంచుతుపాను బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఈ మంచు తుపాను కారణంగా ఇప్పటి వరకూ ఎనమండుగురు మరణించారు. టెక్సాస్, ఫ్లోరిడా, నార్త్ కరోలినాలలో రికార్డు స్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా పలు నగరాలు గడ్డకట్టుకుపోయాయా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

కనీవినీ ఎరుగని స్థాయిలో కురుస్తున్న మంచుకు తోడు చలిగాలులు కూడా వీస్తుండటంతో దక్షిణ అమెరికా అతలాకుతలమైపోయింది. పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లకు సెలవలు ప్రకటించారు.  జాతీయ వాతావరణ శాఖ సమాచారం మేరకు న్యూ ఒర్లీన్ లో రికార్డు స్థాయిలో హిమపాతం నమోదైంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...