మంచు తుపాన్ ఎఫెక్ట్.. అమెరికాలో స్తంభించిన జనజీవనం
posted on: Feb 24, 2026 8:21AM
.webp)
అగ్రరాజ్యం అమెరికాను భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. ఈశాన్యప్రాంతమైన మేరీల్యాండ్ నుంచి మైన్ వరకు విస్తరించిన ఈ ఈ మంచు తుపాను కోట్లాది మంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. దశాబ్ద కాలంలో ఇదే అత్యంత తీవ్రమైన తుపాగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ మంచుతుపానుకు బాంబ్ సైక్లోన్ అని పేరుపెట్టారు. ఈ మంచు తుపాను న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా వంటి ప్రధాన నగరాల్లో జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపచేసింది. దాదాపు రెండు అడుగుల మేరకు మంచు పేరుకుపోయింది. న్యూయార్క్ నగరంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. మంచుతుపానుతో రవాణా వ్యవస్థ కుప్పకూలింది.
5,600కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. రోడ్ ఐలాండ్లో విమానాశ్రయ కార్యకలాపాలను నిలిపివేశారు. పలు నగరాల్లో బస్సులు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా 4.5 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.







