నా డబ్బుతో ఇన్సూరెన్స్ చేస్తా... స్మృతి ఇరానీ

కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఓ హామీ ఇచ్చారు. నరేంద్ర మోడీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అమేథీ నియోజక వర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడుతూ తాను అమేథీ కుటుంబానికి కూతురునని, అమేథీ నియోజక వర్గంలో ఉన్న 25 వేల మంది మహిళలకు తన సొంత డబ్బుతో ఇన్సూరెన్స్ కడతానని హామీ ఇచ్చారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమేథీ ప్రజలకు ఏమీ చేయలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. తాము పదిరోజుల్లోనే పలు రకాల పనులు చేసి చూపిస్తామని, యూపీఏ ప్రభుత్వం చేయలేని పనులను మోడీ ఏడాది పాలనలో చేసి చూపించామన్నారు. స్మృతి ఇరానీ అమేథీ నియోజక వర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఓడిపోయిన సంగతి తెలిసందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu