సారికది ఆత్మహత్యే.. మహిళా సంఘాల ఆందోళన

సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవలు అతి దారుణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా రాజయ్యను, అతని భార్య మాధవి, కొడుకు అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు సేకరించిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు సారికది హత్య కాదు ఆత్మహత్యే అని తెలిపారు. అయితే ఇప్పుడు దీనిపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసును పక్కదారిని పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఫోరెన్సిక్ నివేదికకు వ్యతిరేకంగా మహిశా సంఘాలు ఆందోళన చేపట్టి.. రాజయ్యను, అతని కుటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.