TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్వేతాబసు ప్రసాద్.. మళ్ళీ నటన...

Published on: Thu Nov 27, 2014 4:41PM

 

సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ తిరిగి తన నట జీవితాన్ని ప్రారంభించారు. చాలాకాలం తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు నటించబోతోంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు హన్సల్ మెహతా రూపొందిస్తున్న ఒక డాక్యుమెంటరీలో శ్వేతాబసు ఇప్పుడు నటించబోతోంది. ఒక స్టార్ హోటల్లో అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నామంటూ పోలీసులు ఆమెను కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లోని రెస్క్యూ హోమ్‌కి పంపిన విషయం తెలిసిందే. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, పోలీసులు తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని శ్వేతాబసు ప్రసాద్ చెబుతోంది. నిజానిజాలు ఎలా వున్నప్పటికీ శ్వేతాబసు ప్రసాద్ మళ్ళీ తన నట జీవితాన్ని కొనసాగించడం అభినందనీయమైన విషయం. శ్వేతా బసు ప్రసాద్ ప్రస్తుతం నటిస్తున్న డాక్యుమెంటరీలో ఆమె చాలా కీలకమైన పాత్ర ధరిస్తున్నట్టు తెలుస్తోంది. చిన్నతనంలోనే నటిగా జాతీయ అవార్డును పొందిన శ్వేతా బసు ప్రసాద్ ఈ డాక్యుమెంటరీలో కూడా జాతీయ స్థాయి అవార్డు పొందేంత మంచి పాత్రను ధరిస్తున్నట్టు సమాచారం. ఈ డాక్యుమెంటరీ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది.